Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ మండే... మార్కెట్లు భారీ పతనం : రూ.6.86 లక్షల కోట్ల ఆవిరి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (15:55 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో కేవలం 15 నిమిష్లాలో దాదాపు 6.86 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారుల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,86,708.74 కోట్ల రూపాయల నుంచి 2,02,76,533 కోట్లకు పడిపోయింది.
 
కరోనా ఉద్ధృతి మరింత పెరిగితే బ్యాంకింగ్ రంగానికి గడ్డు కాలమే అని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ రంగ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 
 
మిగిలిన బ్యాంకులు కూడా అదే బాట పడుతున్నాయి. మహారాష్ట్రలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 1741 పాయింట్లు, నిఫ్టీ 527 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments