Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడుగంటిన చమురు నిల్వలు - మరోసారి పెరిగిన ధరలు

Webdunia
మంగళవారం, 24 మే 2022 (10:53 IST)
పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకునివున్న శ్రీలంక దేశంలో చమురు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో పెట్రోల్, డీజల్ కోసం ప్రజలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నారు. ఫలితంగా ఈ చమురు కోసం ప్రజల మధ్య పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుుకుంటున్నాయి. శ్రీలంకలో 1948 తర్వాత ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, శ్రీలంకలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ ధర రూ.450గా ఉంటే, డీజిల్ ధర రూ.445గా పలుకుతోంది. దేశంలో ఇప్పటికీ కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేదు. చమురు నిల్వలు పూర్తిగా అడుగంటి పోయిన నేపథ్యంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేయడంపై ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఇదిలావుంటే, శ్రీలంకకు భారత్ మరోమారు ఆపన్నహస్తం అందించింది. ఇప్పటికే ఒకసారి 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను పంపించింది. ఇపుడు మరోమారు అంతే మొత్తంలో పెట్రోల్‌ను పంపించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments