Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగదు విత్ డ్రా కోసం కొత్త విధానం అమల్లోకి తెచ్చిన ఎస్.బి.ఐ

Webdunia
గురువారం, 28 జులై 2022 (13:31 IST)
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్‌డ్రాపై సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూ.10 వేలకు మించి ఎక్కువగా డబ్బులు డ్రా చేయాలంటే ఇకపై ఖచ్చితంగా వన్ టైమ్ పాస్‌వర్డ్ నంబరు (ఓటీపీ నంబరు)ను ఏటీఎం యంత్రంలో ఎంటర్ చేయాల్సి వుంటుంది. అపుడే రూ.10 వేలకు మించి నగదు విత్ డ్రా చేసేందుకు వీలుపడుతుంది. 
 
ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతోనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. ఖాతాదారుడి మొబైల్‌కు వచ్చే ఓటీపీని సరిగా నమోదు చేయకపోతే.. ఏటీఎం నుంచి నగదు బయటకు రాదని వెల్లడించింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు వీలవుతుంది.
 
తమ బ్యాంకు ఖాతాలో రూ.లక్షకు మించి నగదు నిల్వ ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్ని సార్లయినా నగదును ఉపసంహరించే వీలుందని తాజా నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది. రూ.లక్ష కంటే తక్కువ మొత్తం ఉంటే మాత్రం 5 ఉచిత లావాదేవీలనే అనుమతిస్తారు. ఇతర బ్యాంకుల ఏటీఎంలో నుంచి 3 సార్లు మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు. అంతకుమించితే ప్రతి లావాదేవీకి ఛార్జి పడుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments