Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగదు విత్ డ్రా కోసం కొత్త విధానం అమల్లోకి తెచ్చిన ఎస్.బి.ఐ

Webdunia
గురువారం, 28 జులై 2022 (13:31 IST)
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు ఏటీఎం కేంద్రాల్లో నగదు విత్‌డ్రాపై సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూ.10 వేలకు మించి ఎక్కువగా డబ్బులు డ్రా చేయాలంటే ఇకపై ఖచ్చితంగా వన్ టైమ్ పాస్‌వర్డ్ నంబరు (ఓటీపీ నంబరు)ను ఏటీఎం యంత్రంలో ఎంటర్ చేయాల్సి వుంటుంది. అపుడే రూ.10 వేలకు మించి నగదు విత్ డ్రా చేసేందుకు వీలుపడుతుంది. 
 
ఖాతాదారులు ఏటీఎం మోసాల బారిన పడకుండా చూసే లక్ష్యంతోనే విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. ఖాతాదారుడి మొబైల్‌కు వచ్చే ఓటీపీని సరిగా నమోదు చేయకపోతే.. ఏటీఎం నుంచి నగదు బయటకు రాదని వెల్లడించింది. ఒక ఓటీపీ ద్వారా ఒకే లావాదేవీ చేసేందుకు వీలవుతుంది.
 
తమ బ్యాంకు ఖాతాలో రూ.లక్షకు మించి నగదు నిల్వ ఉంటే, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి ఎన్ని సార్లయినా నగదును ఉపసంహరించే వీలుందని తాజా నోటిఫికేషన్‌లో ఎస్‌బీఐ వెల్లడించింది. రూ.లక్ష కంటే తక్కువ మొత్తం ఉంటే మాత్రం 5 ఉచిత లావాదేవీలనే అనుమతిస్తారు. ఇతర బ్యాంకుల ఏటీఎంలో నుంచి 3 సార్లు మాత్రమే ఉచితంగా అనుమతిస్తారు. అంతకుమించితే ప్రతి లావాదేవీకి ఛార్జి పడుతుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments