Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం మోసాలకు బ్రేక్.. ఎస్‌బీఐ చర్యలు.. జనవరి 1 నుంచి అమలు

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (11:40 IST)
రోజురోజుకీ ఏటీఎం మోసాలు ఎక్కువవుతుండటంతో వీటిని నివారించడానికి ఎస్‌బిఐ చర్యలు ప్రారంభించింది. ఏటిఎం మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి తీసుకురానుంది.
 
ఎస్‌బిఐ కస్టమర్‌లు జనవరి 1వ తేదీ నుంచి రూ. 10 వేలు, అంతకంటే ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీని నమోదు చేయవలసి ఉంటుంది. అయితే ఈ ఓటీపీ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే వర్తిస్తుందని ఎస్‌బిఐ పేర్కొంది. ఈ సమయంలో పది వేలకు పైన డబ్బు విత్‌డ్రా చేసుకునే కస్టమర్‌లను ఓటీపీ నమోదు చేయమని అడుగుతుంది.
 
కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే మాత్రమే విత్‌డ్రా చేయడం వీలవుతుంది. ఓటీపీ విధానం ద్వారా అనధికారిక లావాదేవీలను నివారించవచ్చని ఎస్‌బిఐ పేర్కొంది. అయితే ఎస్‌బిఐ వినియోగదారులు ఇతర ఏటీఎంల్లో లేదా ఇతర బ్యాంక్ కార్డ్ వినియోగదారులు ఎస్‌బిఐ ఏటీఎంల్ల ఈ సదుపాయాన్ని పొందలేరు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments