Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో నీరవ్ మోడీ... రూ.800 కోట్ల రుణాలతో రోటామాక్ అధినేత పరారీ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్ తరహాలోనే కాన్పూర్‌లోని ప్రభుత్వరంగ బ్యాంకులూ రూ.800 కోట్లకుపైగా చేతి చమురు వదిలించుకున్నాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:07 IST)
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) స్కామ్ తరహాలోనే కాన్పూర్‌లోని ప్రభుత్వరంగ బ్యాంకులూ రూ.800 కోట్లకుపైగా చేతి చమురు వదిలించుకున్నాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రుణాన్ని తీసుకున్న రోటామాక్‌ (కలాల తయారీ) కంపెనీ అధినేత విక్రమ్‌ కొఠారీ దేశం విడిచి పారిపోయినట్టు సమాచారం. 
 
ఈయన అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా... ఈ అయిదు బ్యాంకులూ కొన్ని నిబంధనల్ని అతిక్రమించి మరీ రుణాలు ఇచ్చినట్టు సమాచారం.  
 
ముంబైలోని యూనియన్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.485 కోట్లు, కోల్‌కతాలోని అలహాబాద్‌ బ్యాంక్‌ నుంచి రూ.352 కోట్లు తీసుకుని, ఏడాది తర్వాత కూడా అసలు గానీ, వడ్డీగానీ కొఠారీ చెల్లించలేదు. దీంతో రోటోమాక్‌ గ్లోబల్‌ ప్రై.లి. సంస్థని 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా గత యేడాది ప్రకటించింది.
 
పైగా, కాన్పూర్‌ సిటీసెంటర్‌ రోడ్లోని కార్యాలయం వారం రోజులుగా మూతపడే ఉంది. అప్పటినుంచి అధినేత ఆచూకీ తెలియరావడంలేదు. కొఠారీ కూడా నీరవ్‌ మోదీ మాదిరిగా విదేశాలకు చెక్కేసినట్లు అనుమానాలు నెలకొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments