Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్‌

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (14:24 IST)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో సరికొత్తగా మరో రెండు రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. కేవలం ఫోన్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లు ఉపయోగిస్తూ డేటా అవసరం లేని యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ప్లాన్లలో ఒకటి రూ.458 విలుతో 84 రోజుల కాలపరిమితి ఉండేలా తెచ్చింది. అలాగే, రూ.1958 ధరతో 365 రోజుల కాలపరిమితితో తీసుకొచ్చింది. 
 
జియో కొత్తగా రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపరిమిత కాలింగ్ 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దాంతో పాటు యూజర్లు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. 
 
రూ.1958తో తీసుకొచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌ల యూజర్లు దేశంలో అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమత కాలింగ్ ప్రయోజనాలను పొందుతారు. అలాగే 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లను ఉచిత్ యాక్సెస్ లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments