పాత రూ.100 నోటు చెల్లదట... ఏప్రిల్ నుంచి కొత్త నోటు...

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత యేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపింది.

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (13:03 IST)
దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత యేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపింది. ఈ పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పటికే దేశంలో ద్రవ్యకొరత కారణంగా ఆర్థిక మందగమనం ఏర్పడివుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న వంద రూపాయి నోట్లను పూర్తిగా రద్దు చేయనుంది. దాని స్థానంలో కొత్త రూపాయి నోటను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 
 
ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన కొత్త 200 రూపాయల నోట్లను వచ్చే యేడాది మార్చి కల్లా మార్కెట్లోకి పూర్తిగా ప్రవేశ పెట్టి, ఆ తర్వాత కొత్త వంద రూపాయల నోట్ల ముద్రను ప్రారంభించాలని భావిస్తోంది. 
 
నోటు సైజులో మార్పు లేకుండా పాత నోటు సైజులోనే కొత్తవాటిని ముద్రించాలని అధికారులు నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త వంద రూపాయల నోటు ముద్రణ జరుగుతుందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుక్‌ మై షోపై విరుచుకుపడిన నిర్మాత బన్నీ వాసు

NTR: ఎన్.టి.ఆర్. సామ్రాజ్యం సరిహద్దులు దాటింది..

Sidhu Jonnalagadda : తెలుసు కదా.. చేయడం చాలా బాధగా ఉంది, ఇకపై గుడ్ బై : సిద్ధు జొన్నలగడ్డ

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments