Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు డిపాజిట్ చేశారా? ఆర్బీఐ నిబంధన

నోట్ల రద్దు తర్వాత మీ బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకునే విషయంలో భారత రిజర్వు బ్యాంకు మరికొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల మేరకు పెద్దనోట్ల రద్దు తర్వాత

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (12:04 IST)
నోట్ల రద్దు తర్వాత మీ బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసిన ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకునే విషయంలో భారత రిజర్వు బ్యాంకు మరికొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల మేరకు పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2 లక్షలు అంతకన్నా ఎక్కువ డబ్బును జమ చేసిన వారు, రూ.5 లక్షలకుపైగా డబ్బు ఉన్న ఖాతాదారులు నగదు విత్ డ్రా చేసుకొనేందుకు పాన్‌ నంబరును తప్పనిసరిగా సమర్పించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పాన్‌ లేకుంటే ఫాం 60 సమర్పించాలన్న నిబంధన విధించింది. ఈ నిబంధన నగదు బదిలీకి కూడా వర్తిస్తుందని పేర్కొంది. 
 
అలాగే, జన్‌ధన్‌ ఖాతాదారులు మాత్రం రూ.లక్షకు మించి డిపాజిట్‌ చేసినప్పటికీ... వారికి ప్రతి నెలా రూ.10 వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కొన్ని బ్యాంకుల్లో కేవైసీ నిబంధనలను పాటించడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిబంధనలు విధించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఇకపై పైన పేర్కొన్న ఖాతాల్లో ప్రతి లావాదేవీకీ పాన్‌ను తప్పనిసరిగా కోట్‌ చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments