Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వేల్లో దుర్గంధాన్ని పసిగట్టే అత్యాధునిక సాంకేతికత!!

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (13:45 IST)
దేశంలో నిత్యం పరుగులు తీసే రైళ్లలో అనేక రైలు బోగీల్లో దుర్గంధం వెదజల్లుతుంటుంది. ఈ దుర్వాసను భరిస్తూనే ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా, దూర్గంధ భూయిష్ట, అపరిశుభ్ర టాయిలెట్లు ప్రధాన సమస్యగా ఉంది. 
 
ఈ సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. పైగా, రైళ్లలోని అపరిశుభ్రతపై ప్రయాణికుల ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా రైల్వే శాఖ అత్యాధునిక ఐఓటీ సాంకేతికతను (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగించే యోచనలో ఉంది. 
 
ఈ దిశగా రైల్వే బోర్డు కీలక ప్రతిపాదనలు చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సాంకేతికను రైల్వే బోర్డు ప్రయోగాత్మకంగా కొన్ని కోచ్‌‍లలో పరీక్షించనుంది. ఈ పైలట్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు రైల్వే బోర్డు.. ముంబైకి చెందిన విలిసో టెక్నాలజీస్ సంస్థను ఎంపిక చేసింది. 
 
 
ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని బోగీలలో మరుగుదొడ్లలో ప్రత్యేక డిటెక్టర్లను ఏర్పాటుచేశారు. బాత్రూమ్‌లలో దుర్గంధానికి కారణమయ్యే వాయువులను ఇవి గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఓ సెంట్రల్ హబ్‌కు చేరవేస్తాయి. 
 
ఈ సమాచారం ఆధారంగా పారిశుద్ధ్య సిబ్బంది.. అపరిశుభ్ర టాయిలెట్ల సమాచారం అందిన వెంటనే వెళ్లి సమస్య పరిష్కరిస్తారు. సంబంధిత సిబ్బందికి మొబైల్ యాప్, వెబ్ యాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందని విలిసో టెక్నాలజీస్ పేర్కొంది. అయితే, ఇది ఏ మేరకు సక్సెక్ అవుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments