నోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఇక తీరినట్టేనా? ప్రారంభమైన రూ.200 నోట్ల ముద్రణ

నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతేడాది నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్ల

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (10:03 IST)
నోట్ల రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతేడాది నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. అయితే రూ.2 వేలు, రూ.500 నోట్లు ఎక్కువగా బయటకు రావడంతో చిల్లర కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. 
 
జేబులో డబ్బులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. కానీ తాజాగా హై సెక్యూరిటీ ఫీచర్లతో ముద్రిస్తున్న ఈ 200 నోట్లు చలామణిలోకి వస్తే ప్రజలకు చిల్లర కష్టాలు తీరినట్టేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 
 
కొన్నివారాల క్రితమే ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌లో వీటి ముద్రణ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని హోషన్‌గాబాద్ ప్రభుత్వ ప్రెస్‌లో వీటి ముద్రణ జరుగుతుంది. ఆపై మైసూరు, పశ్చిమ బెంగాల్‌లోని సాల్బోనీల్లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెస్‌ల్లో రూ.200 నోట్లను ముద్రిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments