Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ : చందా కొచ్చర్ - శిఖా శర్మలకు ఉచ్చు

పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ స్కామ్) ప్రభావం మరింత మంది బ్యాంకర్లను కలవరపెడుతోంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు అవినీతి వ్యతిరేక సంస్థ ఎస్‌ఎఫ్ఐవో నో

Webdunia
మంగళవారం, 6 మార్చి 2018 (13:50 IST)
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ స్కామ్) ప్రభావం మరింత మంది బ్యాంకర్లను కలవరపెడుతోంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు అవినీతి వ్యతిరేక సంస్థ ఎస్‌ఎఫ్ఐవో నోటీసులు జారీచేసింది. ముకుల్ చోక్సీకి చెందిన గీతాంజలి నగల సంస్థకు రుణాలు మంజూరు చేయడంపై విచారణ జరిపేందుకు ఈ ఇరువురు టాప్ బ్యాంకర్లకు నోటీసులు జారీచేసినట్టు చెబుతున్నారు.
 
సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా తీసుకుని దేశం విడిచి పారిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు ఏసీబీ నోటీలు జారీ చేయడం ఇపుడు దేశ బ్యాంకింగ్ రంగంలో సంచలనంగా మారింది.
 
కాగా, నీరవ్‌ మోడీతో తమకెలాంటి సంబంధం లేదని.. గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే తాము రుణం ఇచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే ఎంత అప్పు ఇచ్చిందనే విషయాన్ని తెలపలేదు. అలాగే, యాక్సిస్‌ బ్యాంకు కూడా గీతాంజలి గ్రూపునకు భారీగా రుణం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు మేజర్‌ బ్యాంకులకు చెందిన ఎండీలకు ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments