Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్‌ధన్ ఖాతాల్లోకి మరోమారు రూ.500 నగదు జమ

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (21:31 IST)
కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తూ లాక్డౌన్‌లోకి వెళ్లింది. ఈ లాక్డౌన్ కారణంగా చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా, కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తూ వస్తోంది. ఈ కోవలోనే ఆర్థికంగా నష్టపోయిన మహిళలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 
 
ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రూ.500 చొప్పున జన్‍‌ధన్ ఖాతాల్లో నగదును జమ చేసింది. ఇపుడు మూడో విడతగా నగదును జమ చేయనున్నట్టు తీపికబురు చెప్పింది.
 
ఈ విడతలో కూడా ఈ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలోకి రూ.500 జమ కానున్నాయి. జూన్ 5వ తేదీ నుంచి 10 వరకు డబ్బు జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడానికి చివరి విడత డబ్బును జమ చేస్తున్నట్టు తెలిపింది. 
 
కాగా, ఇప్పటికే లాక్డౌన్ వల్ల నష్టపోయిన రంగాలను ఆదుకునేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.1.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధులతో అన్ని రంగాలను ఆదుకునేలా ప్రణాళికలను రూపొందించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments