Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాను ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ మారుస్తాం : ప్రధాన మోడీ

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:20 IST)
మనదేశ జనాభా 130 కోట్లు. అందులో సింహ భాగం యువతే. కానీ, ఈ జనాభాలో పన్ను చెల్లించే వారి సంఖ్య కేవలం కోటిన్నర మంది మాత్రమే. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వెల్లడించారు. దేశం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఈ పరిస్థితి మారాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదండోయ్... ప్రజలంతా నిజాయితీగా పన్నులు చెల్లిస్తామని వాగ్దానం చేయాలని సూచించారు. ఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, '2022లో మనం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భాన్ని వేడుకగా చేసుకుందాం. ఇండియాను సరిగ్గా పన్నులు కట్టే, గౌరవించే దేశం (ట్యాక్స్ కంప్లియంట్ సొసైటీ)గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. గత నాలుగైదేళ్లుగా ఆ దిశగా చాలా వర్క్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది' అని చెప్పుకొచ్చారు. 
 
పన్నులు కట్టే వాళ్లకు అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేశామని మోడీ అన్నారు. పీపుల్స్ సెంట్రిక్ (ప్రజలే కేంద్రం)గా ఉండేలా విధానాలను ప్రవేశపెడుతున్నామన్నారు. ట్యాక్స్‌లకు సంబంధించి డిపార్ట్‌మెంట్లను పునర్వ్యవస్థీకరించామని, అవినీతికి చోటులేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments