Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ సందేశంతో వల విసిరారు - బీఎస్‌ఎన్ఎల్ కస్టమర్లకు అలెర్ట్

ఠాగూర్
సోమవారం, 9 జూన్ 2025 (18:49 IST)
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు టార్గెట్ చేసేలా సైబర్ మోసగాళ్ళు ఓ నకిలీ సందేశంతో వల విసిరారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారిని తప్పుదారి పట్టించే సందేశాలను పంపి ఖాతాలను ఖాళీ చేసేందుకు కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. 
 
తాజాగా బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లను టార్గెట్‌ చేసేలా ఒక నకిలీ సందేశంతో వల విసిరారు. వినియోగదారుల కేవైసీ ట్రాయ్ నిలిపివేస్తుందని, 24 గంటల్లో సిమ్ కార్డు బ్లాక్ చేస్తారంటూ అసత్య సందేశాలు పంపి గందగగోళం సృష్టిస్తున్నారు. ఒక నంబర్ ఇచ్చి కాల్ చేయాలని పేర్కొన్నారు. 
 
అయితే, ఈ నకిలీ సందేశంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అలాంటి సందేశాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇది ఫేక్ నోటీసు, బీఎస్ఎన్‌ఎల్ ఎపుడూ సిమ్ కేవైసీకి సంబంధించి ఎలాంటి నోటీసూ పంపించదు. 
 
ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండండి అని సూచించింది. ఏదైనా వార్తను నమ్మడం, వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకోవాలని ప్రజలను సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments