Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆల్‌టైమ్ రికార్డు : వరుసగా ఎనిమిదో రోజూ బాదుడే

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:14 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. గత ఎనిమిది రోజులుగా వీటి ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీలు ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని తాను చేస్తున్నాయి. ఈ కారణంగానే దేశంలో చమురు ధరలు ఆల్‌టైన్ గరిష్టస్థాయికి చేరాయి. 
 
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం కూడా లీటర్‌ పెట్రోల్‌ ధరపై రూ.26-30పైసలు పెంచగా లీటర్‌ డీజిల్‌పై 33-38పైసలు పెంచారు. దీంతో  దేశరాజధాని ఢిల్లీలో తొలిసారి పెట్రోల్‌ ధర రూ.89.29 దాటింది. అలాగే లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.70కు పెరిగింది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.84, డీజిల్‌ ధర రూ.86.93గా ఉన్నాయి. గత ఎనిమిది రోజుల నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.36, డీజిల్‌ రేటు రూ.2.91 పెరిగింది. మంగళవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెట్రో ధరలను ఓసారి పరిశీలిస్తే, 
 
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.89.29, ముంబైలో రూ.95.75, చెన్నైలో రూ.91.45, హైదరాబాద్‌లో 92.84, బెంగుళూరులో రూ.92.28, పాట్నాలో రూ.91.67, లక్నోలో రూ.87.27, జైపూర్‌లో రూ.95.75, గుర్గామ్‌లో 87.29 చొప్పున ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments