Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ ఆగేలాలేదు: ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించేదే లేదు

Webdunia
శనివారం, 3 జులై 2021 (15:12 IST)
పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి.. పెట్రోల్ ఎప్పుడూ సెంచరీ కొట్టేయగా.. డీజిల్‌ సైతం చాలా ప్రదేశాల్లో సెంచరీని బీట్ చేసింది. అయితే, ఇప్పట్లో పెట్రోల్‌పై వడ్డింపు ఆగేలా కనిపించడంలేదు. ఎందుకంటే.. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని తెలిపారు.
 
పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్న నిర్మలా సీతారామన్.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరిగితే.. ఇక్కడా పెంచుతారని… అక్కడి తగ్గితే.. ఇక్కడ కూడా తగ్గిస్తారని ఆమె చెప్పారు. 
 
వ్యాక్సిన్లు మరియు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం డబ్బు ఖర్చు చేయడంతో పాటు పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు అందించడానికి కేంద్రం భారీగా ఖర్చు చేస్తోందని తెలిపారు నిర్మలా సీతారామన్.. కాబట్టి, పెట్రోల్‌పై పన్నులు లేదా సుంకాలను తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపశమనం కలిగించవచ్చు అన్నారు.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తేనే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాగలం అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments