Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 25 రోజులుగా నిలకడగా చమురు ధరలు...

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (12:34 IST)
దేశంలో చమురు ధరలు నిలకడగా ఉన్నాయి. ముఖ్యంగా, ఇటీవల దేశ వ్యాప్తంగా వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత కూడా పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ధరల ప్రకారం కూడా ఈ చమురు ధరల్లో తేడా కనిపించలేదు. అంటే.. గత 25 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.103.97గాను, డీజిల్ ధర రూ.86.67గాను ఉంది. అలాగే, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.98, డీజిల్ ధర రూ.94.14 చొప్పున ఉంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో రూ.108.20గా ఉంటే డీజిల్ ధర రూ.94.62గా వుంది. విజయవాడ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.110.50గా ఉంటే డీజిల్ ధర రూ.96.46గా ఉంది. కాగా, వచ్చేయేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కేంద్ర ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, పెట్రోల్ ధరలను వీలైనంత మేరకు స్థిరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments