Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (09:28 IST)
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం కూడా స్వల్పంగా తగ్గాయి. చమురు సంస్థలు ఈ రెండింటిపైనా లీటరుకు 20 పైసల చొప్పున తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఇంధన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
డీజిల్ ధర తగ్గడం వారంలో ఇది నాలుగో సారి కాగా, పెట్రోలు ధర తగ్గడం ఇదే తొలిసారి. గత నెల 17న చివరిసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గత కొన్ని నెలలుగా చమురు ధరలను ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుతూ వస్తున్న విషయం తెల్సిందే. 
 
అదేసమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలోనే చమురు సంస్థలు ధరల పెంపు జోలికి పోలేదు. ధర పెంపుపై విపక్షాలు ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ధరల తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.101.64కు, డీజిల్ ధర రూ.89.07కు తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments