Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని పెట్రో బాదుడు... మే నెలలో చమురు ధరలు ఎన్నిసార్లు పెరిగాయంటే...

Webdunia
మంగళవారం, 25 మే 2021 (09:01 IST)
దేశాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. దీంతో కోట్లాది మంది ప్రజలు ఆర్థికస్థితి చితికిపోయింది. అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని చమురు సంస్థలు మాత్రం ఏమాత్రం కరుణ చూపించడం లేదు. పెట్రోల్ ధరల పెంపును కొనసాగిస్తూనే ఉన్నాయి. 
 
ఇటీవల కాలంలో నిత్యం పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. అంతకుముందు ఆదివారం ఇంధన ధరలు పెరిగాయి. అయితే.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు ధరలను మళ్లీ ధరల బాదును ప్రవేశపెట్టాయి. 
 
ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో సెంచరీ కొట్టాయి. తాజాగా చమురు కంపెనీలు పెట్రోల్‌ లీటర్‌కు 23 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 27 పైసల వరకూ పెంచాయి.
 
తాజాగా పెంచిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.44 కి చేరగా.. డీజిల్‌ లీటర్ రూ.84.32కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర వందకు చేరువైంది. పెట్రోల్‌ రూ.99.71, డీజిల్‌ రూ.91.57కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.93.49, డీజిల్‌ రూ.87.16 కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.93.49, డీజిల్‌ 87,16కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.12, డీజిల్‌ రూ.91.92కు చేరింది. విజయవాడలో పెట్రోల్ ధర 99.77 ఉండగా.. డీజిల్ ధర 93.96 కి పెరిగింది.
 
మరోవైపు, పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100ను దాటేసింది. మే నెలలో (25 రోజుల్లో ) ఇప్పటివరకు 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఇప్పటివరకు పెట్రోల్‌పై దాదాపు రూ.2.80, డీజిల్‌పై రూ.3పైగా పెంచాయి. పెట్రోల్ రిటైల్ అమ్మకపు ధరలో 60 శాతం, డీజిల్‌లో 54 శాతానికి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు విధిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.32.90, డీజిల్‌పై రూ .11.80 వసూలు చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments