Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగని పెట్రోల్ బాదుడు.. సెంచరీని దాటే దిశగా పెట్రోల్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (11:39 IST)
పెట్రోల్‌ బాదుడు ఆగడం లేదు. లీటర్‌ పెట్రోల్‌ సెంచరీని దాటే దిశగా దూసుకుపోతోంది. డీజిల్‌ ధరలు సైతం పెట్రోల్‌ ధరలతో పోటీపడి పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర సెంచరీకి చేరువైంది. తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు మేర రేటు పెరిగింది. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్‌ ధర 35 సార్లు పెరగగా, డీజిల్‌ 34 సార్లు ధర పెరగడం గమనార్హం. 
 
సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.86 కు చేరుకోగా, డీజిల్‌ ధర రూ.89.36 వద్ద నిన్నటి ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ... పెట్రోల్‌ ధర 37 పైసల మేర పెరిగింది. 
 
హైదరాబాద్‌లో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.103.78కు చేరగా, డీజిల్‌ నిన్నటి ధర రూ.97.40గా ఉంది. హైదరాబాద్‌ కంటే జిల్లాలలో అధిక ధరలకు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా పెట్రోల్‌ ధర రూ. 105.80, డీజిల్‌ ధర రూ.105.37గా ఉన్నాయి. ఇక విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.59 కాగా, లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.01గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments