Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కరెన్సీ పతనం - ఒక్క డాలర్ రూ.144

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (17:45 IST)
పాకిస్థాన్ కరెన్సీ విలువ రోజురోజుకూ పతనమైపోతోంది. శుక్రవారం అది మరింత పతనమైంది. ఒక్క రోజే జీవితకాల గరిష్టానికి చేరింది. ఫలితంగా ఒక్క డాలర్ విలువ రూ.144కు చేరింది. ఫలితంగా దాయాదిదేశం పాకిస్థాన్ ఆర్థిక కష్టాల్లో కూరుకుంటుంది. 
 
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా వారంతా వేడుకలు కూడా జరుపుకున్నారు. ఆ తర్వాతి రోజే డాలరుతో పాకిస్థాన్ కరెన్సీ విలువ ఏకంగా రూ.10 తగ్గిపోయింది. 
 
దేశానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటూ 100 రోజుల పాలన సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా.. కరెన్సీ పతనాన్ని ఆపలేకపోయింది. మార్కెట్‌లో ఓ రకమైన భయం నెలకొన్నదని, అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
ఇకపోతే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి బెయిల్ ఔట్ ప్యాకేజీ అందుకోవడంలో భాగంగా కావాలనే రూపాయి విలువను తగ్గించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యే ఐఎంఎఫ్ అధికారులు పాకిస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా చైనా చేస్తున్న ఆర్థిక సాయాన్ని వెల్లడించడంతోపాటు ఇంధన ధరలను పెంచాలని, మరిన్ని పన్నులు విధించాలని, రూపాయి విలువను తగ్గించుకోవాలన్న షరతులు విధించింది. ఈ కారణంగానే పాక్ కరెన్సీ విలువ పడిపోతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments