పాకిస్థాన్ కరెన్సీ పతనం - ఒక్క డాలర్ రూ.144

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (17:45 IST)
పాకిస్థాన్ కరెన్సీ విలువ రోజురోజుకూ పతనమైపోతోంది. శుక్రవారం అది మరింత పతనమైంది. ఒక్క రోజే జీవితకాల గరిష్టానికి చేరింది. ఫలితంగా ఒక్క డాలర్ విలువ రూ.144కు చేరింది. ఫలితంగా దాయాదిదేశం పాకిస్థాన్ ఆర్థిక కష్టాల్లో కూరుకుంటుంది. 
 
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా వారంతా వేడుకలు కూడా జరుపుకున్నారు. ఆ తర్వాతి రోజే డాలరుతో పాకిస్థాన్ కరెన్సీ విలువ ఏకంగా రూ.10 తగ్గిపోయింది. 
 
దేశానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటూ 100 రోజుల పాలన సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా.. కరెన్సీ పతనాన్ని ఆపలేకపోయింది. మార్కెట్‌లో ఓ రకమైన భయం నెలకొన్నదని, అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
 
ఇకపోతే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి బెయిల్ ఔట్ ప్యాకేజీ అందుకోవడంలో భాగంగా కావాలనే రూపాయి విలువను తగ్గించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్యే ఐఎంఎఫ్ అధికారులు పాకిస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా చైనా చేస్తున్న ఆర్థిక సాయాన్ని వెల్లడించడంతోపాటు ఇంధన ధరలను పెంచాలని, మరిన్ని పన్నులు విధించాలని, రూపాయి విలువను తగ్గించుకోవాలన్న షరతులు విధించింది. ఈ కారణంగానే పాక్ కరెన్సీ విలువ పడిపోతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments