Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓలా క్యాబ్‌లో ప్రయాణించండి... 15 రోజుల తర్వాత చెల్లించండి...

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (11:41 IST)
దేశంలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఓలాకు ఒకటి. అతి తక్కువ చార్జీలకే కారు ప్రయాణ సేవలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చిన సంస్థగా గుర్తింపు వుంది. అలాంటి ఓలా క్యాబ్ సంస్థ తాజాగా ఓలా మనీ పోస్ట్ పెయిడ్ పేరిట సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఈ సేవల ప్రకారం.. ఓలా క్యాబ్‌లో ప్రయాణం చేసిన తర్వాత 15 రోజుల్లోపు ఎపుడైనా ప్రయాణ చెల్లింపులు చేయవచ్చు. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా విడివిడిగా కూడా చెల్లించవచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ తరహా ఆవకాశం కొంతమంది కస్టమర్లకే అందించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని తెలిపింది. 
 
నిజానికి గత యేడాది పైలట్ ప్రాజెక్టుగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నెల నెలా కస్టమర్లు 30 శాతం మేరకు వృద్ధి చెందారు. అందుకే పూర్తి స్థాయిలో త్వరలోనే 15 కోట్లకుపైగా కస్టమర్లకు ఈ సేవలను అందించాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం ఇన్విటేషన్ ద్వారా ఎంపిక చేసిన కస్టమర్లకే ఈ సేవలను అందిస్తోంది. క్యాబ్ సర్వీసులు వినియోగించుకున్న తర్వాత 15 రోజుల్లోపు ఎలాంటి పాస్ వర్డ్, ఓటిపి అవసరం లేకుండా డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments