Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం.. సామాన్యుడిపై మరింత భారం?

కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేందుకు సంసిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల అనిశ్చితి కొనసాగుతుండటంతో భారత్‌లో పెట్రోల్ ధరలు

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (10:21 IST)
కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపేందుకు సంసిద్ధమవుతోంది. పెట్రోల్ ధరలను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల అనిశ్చితి కొనసాగుతుండటంతో భారత్‌లో పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం భారత్‌పై వుంటుందని జైట్లీ తెలిపారు.
 
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రకారం.. పెట్రోల్ ధరల్లో మార్పులు తప్పవని జైట్లీ చెప్పారు. క్రూడాయిల్ ధరలు ఏ వైపునకు సాగుతాయో అంచనా వేసే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రాలు విధిస్తున్న సుంకాలను తగ్గిస్తే ప్రజలకు ఊరట లభిస్తుందని తెలిపారు. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో సమావేశమైన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. పరపతి విధాన సమీక్షలు దేశాభివృద్ధికి తోడ్పడేలా వుండాలని.. అంతేకానీ రోజు రోజుకీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని విధానాలను మార్పుచుకుంటూ పోకూడదని సూచించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments