ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా నుంచి జూన్ ఒకటో తేదీ నుంచి 50 వేల రూపాయల వరకు విత్డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ మొత్తం నుంచి టీడీఎస్ (పన్నుకోత) కూడా పట్టుకోరు. నిజానికి ప్రస్తుతం ఈ పరిమితి రూ.30 వేల వరకు మాత్రమే ఉండగా దాన్ని రూ.50 వేలకు పెంచుతూ ప్రభుత్వం నోటిఫై చేసింది.
ఉద్యోగులు ముందుగానే పీఎఫ్లో సొమ్ము విత్డ్రా చేయకుండా ఉండేందుకు, రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తం చేతికి వచ్చేలా ఉండేందుకు పీఎఫ్ విత్డ్రాలపై పన్ను విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, సభ్యులు 15జి లేదా 15హెచ్ ఫారం సమర్పిస్తే ఈ పన్ను ఉండదు. ఈ మొత్తం అందుకున్న తర్వాత కూడా తమ వార్షికాదాయం ఆదాయపన్ను పరిమితి లోపలే ఉంటుందని ఈ ఫారాల ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.