Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి, సూపర్ స్టార్, మాధురీ దీక్షిత్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్న నందనీ క్రియేషన్ లిమిటెడ్

Webdunia
సోమవారం, 17 జులై 2023 (23:34 IST)
నందనీ క్రియేషన్ లిమిటెడ్, కంపెనీ బ్రాండ్‌లు “జైపూర్ కుర్తి”, “దేశీ ఫ్యూజన్ బై జైపూర్ కుర్తి”ని ప్రచారం చేయడానికి బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్నట్టు ప్రకటించింది. దీనితో సంస్థ డిజిటల్ మీడియా ప్రకటనలతో పాటు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ బ్రాండింగ్‌లో ఆమె కనిపించనున్నారు. 
 
పద్మశ్రీ అవార్డు గ్రహీత మాధురీ దీక్షిత్ ప్రముఖ భారతీయ నటి- కళాకారిణి. 70+ హిందీ చిత్రాలలో నటించిన ఆమె భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన నటులలో ఒకరు. సినిమాల్లో నటించడంతో పాటు దాతృత్వ కార్యక్రమాల్లో కూడా ఆమె నిమగ్నమై ఉన్నారు. ఆమెను డ్యాన్స్ రియాలిటీ షోలకు ప్రతిభావంతురాలైన జడ్జిగా కూడా గుర్తించవచ్చు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశిష్ట సహకారానికి ఆమె 50+ అవార్డులను గెలుచుకున్నారు.
 
ఈ అసోసియేషన్‌లో భాగంగా, మాధురీ దీక్షిత్ దేశవ్యాప్తంగా కంపెనీ పరిధిని విస్తరించేలా "జైపూర్ కుర్తీ" మరియు "దేశీ ఫ్యూజన్ బై జైపూర్ కుర్తీ" బ్రాండ్ ఉత్పత్తులను ప్రచారం చేయనున్నారు. బ్రాండింగ్ ప్రచారం కింద, నందిని క్రియేషన్ లిమిటెడ్ తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో యొక్క డిజిటల్ మీడియా ప్రకటనలతో పాటు అవుట్‌డోర్ మార్కెటింగ్, ఇన్-స్టోర్ విజువల్ బ్రాండింగ్ (ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్) ద్వారా ప్రచార కార్యకలాపాలను చేపట్టాలని యోచిస్తోంది. 
 
ఈ భాగస్వామ్యం గురించి నందిని క్రియేషన్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనుజ్ ముంద్రా మాట్లాడుతూ, “మా బ్రాండ్ ముఖ చిత్రంగా మాధురీ దీక్షిత్‌ ఉండటం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. ఈ భాగస్వామ్యం మా కస్టమర్‌లతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి, మా బ్రాండ్ యొక్క తత్వాన్ని తెలియజేయడానికి మాకు సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము.." అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments