Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా..?

Webdunia
సోమవారం, 27 జులై 2020 (14:55 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తోంది. ఆర్ఐఎల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో అరుదైన ఘనత సాధించింది. అమెరికాకు చెందిన ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సంస్థగా ఆవిర్భవించింది.
 
ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థలైన డిజిటల్‌, రీటైల్‌ వ్యాపారాలు దూకుడుగా ఉండటంతో ఈ కంపెనీ మార్కెట్‌ విలువ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారమే కంపెనీ మార్కెట్‌ విలువ 189 బిలియన్‌ డాలర్లను తాకడంతో ఎక్సాన్‌ మొబిల్‌ను దాటేసింది. ఈ రెండింటి మధ్య బిలియన్‌ డాలర్ల తేడా ఉంది.
 
అలాగే రిలయన్స్‌ తన అనుబంధ వ్యాపారాలను అద్భుతంగా వినియోగించుకుంటోంది. రిలయన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను విక్రయించడానికి ఇది మంచి వేదికగా ఉపయోగపడింది. జియో వచ్చిన కొత్తల్లో రిలయన్స్‌ డిజిటల్‌ ఊతకర్రలాగా పనిచేసింది. భారత్‌ రిటైల్‌ రంగంలో పట్టు బిగించాక.. టెలికాం రంగంలోకి వచ్చింది.. డేటా మార్కెట్‌లో తిరుగు లేని ఆధిపత్యం సంపాదించాక ఈ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇలా ఒక్కో రంగంలో రిలయన్స్ పట్టు బిగుస్తోంది. ఈ క్రమంలో కొనుగోళ్లకు కూడా వెనుకాడట్లేదు. 
 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయాల్లో సింహభాగం ఇప్పటికీ పెట్రో కెమికల్‌, చమురు శుద్ధి వ్యాపారం నుంచే లభిస్తోంది. 2019 జూన్‌ త్రైమాసికంలో కంపెనీ స్థూల ఆదాయంలో 32శాతం కన్జ్యూమర్‌ బిజినెస్‌ నుంచే లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments