Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఎక్కాలంటే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు 2 గంటలు ముందుగా..

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (11:03 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశంలో రైలు ప్రయాణం మరింత కఠినంకానుంది. విమానం ఎక్కేందుకు ఏవిధంగా అయితే ఎయిర్‌పోర్టుకు రెండు గంటలకు ముందుగా చేరుకుంటామో.. అలాగే, రైలు బయలుదేరే సమయానికి రెండు గంటలు ముందుగానే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు తేలితేనే రైలు బోగీలోకి ఎక్కనిస్తారు. ఇలాంటి కఠిన నిబంధనలతో ఇకపై రైలు ప్రయాణం సాగనుంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫలితంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లోవుంది. ఈ కారణంగా రైల్వే శాఖ కూడా రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం సాగుతున్న రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత రైళ్ళ రాకపోకలు కొనసాగించాలన్న ఆలోచనలో రైల్వే శాఖ ఉంది. 
 
అయితే, కఠిన ఆంక్షలతో రైళ్లను నడపాలని భావిస్తోంది. మే మూడో తేదీన లాక్‌డౌన్ తొలగించి, రైళ్లు నడిచేందుకు అనుమతులు లభిస్తే, రైళ్లలో ప్రయాణాలకు కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరికానుంది. ఈ మేరకు పలు రైల్వే స్టేషన్లలో మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తునిలోనూ ఇదే తరహా మాక్ డ్రిల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది నిర్వహించారు.
 
రైలు ఎక్కాలంటే, ఎయిర్ పోర్టుకు వెళ్లినట్టుగా కనీసం 2 గంటల ముందే స్టేషన్‌కు చేరుకోవాల్సివుంటుంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. ఆపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్యమూ లేదని తేలితేనే రైలు ఎక్కేందుకు అనుమతి లభిస్తుంది. 
 
ఇక బుకింగ్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవాలన్నా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఈ మేరకు రైల్వే స్టేషన్లలో ధర్మల్ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తంమీద కరోనా వైరస్ తర్వాత ప్రతిదీ ఆంక్షలతో కూడుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments