Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంట గ్యాస్ బాదుడు : రాయితీ సిలిండరుపై రూ.50 పెంపు - ఇకపై ప్రతి 15 రోజులకోసారి...

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (07:08 IST)
వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ.100కు చేరువగా వెళ్తున్న వేళ.. సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు పెంచాయి. 
 
దేశంలో పెట్రోలు ధరలు సెంచరీకి చేరువైన వేళ.. గ్యాస్ సిలిండరుపై మరో రూ.50 పెంచాయి. ఈ బాదుడుతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఈ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండరు ధర రూ.769కి చేరింది. ఈ పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయట.
 
దేశంలో అసలే పెట్రోలు ధరలు పెరుగుదలతో సామాన్యుడి జేబు చినిగిపోతోంది. రోడ్డుపైకి బైక్‌పై వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నా సరే మన జేబు సురక్షితం కాదని చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో తేలిపోయింది. 

అంతేకాకుండా, ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తున్న ప్రభుత్వం అదే విధానాన్ని గ్యాస్‌పైనా అమలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగానే నేటి నుంచి ధరల పెంపు అమలు మొదలుపెట్టింది. అంటే మరో 15 రోజుల తర్వాత మరోమారు బాదుడు ఉంటుందన్న మాట.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments