వంట గ్యాస్ బాదుడు : రాయితీ సిలిండరుపై రూ.50 పెంపు - ఇకపై ప్రతి 15 రోజులకోసారి...

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (07:08 IST)
వంటింట్లో గ్యాస్‌ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్‌ ధర ప్రతిరోజూ పెరుగుతూ రూ.100కు చేరువగా వెళ్తున్న వేళ.. సామాన్యుడి నడ్డి విరిచేలా రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను చమురు సంస్థలు పెంచాయి. 
 
దేశంలో పెట్రోలు ధరలు సెంచరీకి చేరువైన వేళ.. గ్యాస్ సిలిండరుపై మరో రూ.50 పెంచాయి. ఈ బాదుడుతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. ఈ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండరు ధర రూ.769కి చేరింది. ఈ పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయట.
 
దేశంలో అసలే పెట్రోలు ధరలు పెరుగుదలతో సామాన్యుడి జేబు చినిగిపోతోంది. రోడ్డుపైకి బైక్‌పై వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నా సరే మన జేబు సురక్షితం కాదని చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంతో తేలిపోయింది. 

అంతేకాకుండా, ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తున్న ప్రభుత్వం అదే విధానాన్ని గ్యాస్‌పైనా అమలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగానే నేటి నుంచి ధరల పెంపు అమలు మొదలుపెట్టింది. అంటే మరో 15 రోజుల తర్వాత మరోమారు బాదుడు ఉంటుందన్న మాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments