వంట గ్యాస్ ధర బాదుడు... సబ్సిడీయేతర గ్యాస్ ధర పెంపు

Webdunia
గురువారం, 1 జులై 2021 (11:50 IST)
దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధ‌ర పెరుగుద‌ల‌తో ఇప్ప‌టికే ఇబ్బందులు ప‌డుతోన్న సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధ‌ర‌ల రూపంలో మరో పిడుగు పడుతోంది.
 
తాజాగా సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను చమురు కంపెనీలు పెంచేశాయి. కొత్తగా పెంచిన ధరల మేరకు... 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్‌పై రూ.25.50 పెంచుతున్న‌ట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ తెలిపింది. 
 
ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆరు నెల‌ల్లో 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధర రూ.140 పెరిగింది. దీంతో ఢిల్లీ, ముంబైలో మే 1 నుంచి 809 రూపాయ‌లుగా ఉన్న 14.2 కిలోల సిలిండర్ ధర రూ.834.50కి చేరింది.
 
చెన్నైలో అత్య‌ధికంగా రూ.850.50గా 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధ‌ర ఉంది. మే 1 నుంచి నిన్న‌టివ‌ర‌కు అక్క‌డ సిలిండర్ ధ‌ర 825 రూపాయ‌లుగా ఉంది. కాగా, 19 కిలోల‌ వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ.76 పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments