Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది...

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (17:32 IST)
వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.21 ఎగబాకింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.1,796.50కు చేరింది. ముంబైలో ఈ ధర రూ.1,749గా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సవరణలు చేసినట్లు ఇంధన రిటైల్‌ కంపెనీలు తెలిపాయి. అదేసమయంలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధర రూ.903 వద్ద స్థిరంగా ఉంది.
 
మరోవైపు విమాన ఇంధన ధరల్లో ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్‌ కంపెనీలు మరోసారి కోత విధించాయి. దిల్లీలో ఒక్కో కిలోలీటర్‌ ధర రూ.5,189.25 తగ్గి రూ.1,06,155.67కు చేరింది. ఏటీఎఫ్‌ ధరను తగ్గించడం ఈ నెలలో ఇది రెండోసారి. నవంబర్‌ ఒకటో తేదీన కిలోలీటర్‌పై రూ.6,854.25 తగ్గిన విషయం తెలిసిందే. అంతకుముందు జులై 1 నుంచి నాలుగు దశల్లో కంపెనీలు ఏటీఎఫ్‌ ధరను రూ.29,391.08 పెంచాయి. తాజాగా రెండుసార్లు తగ్గించడంతో విమానయాన సంస్థలపై కొంత మేర భారం తగ్గినట్లయింది.
 
మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. గత 21 నెలలుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్‌ ధర రూ.89.62 దగ్గర ఉంది. చివరిసారి ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన 2022 మేలో ఇంధన రిటైల్‌ కంపెనీలు ధరల్ని సవరించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments