Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:50 IST)
సిలిండర్ ధరలు పెరిగాయి. సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన చమురురంగ సంస్థలు సవరిస్తాయి. తాజాగా, చమురు రంగ కంపెనీలు 14.2 కిలోల సిలిండర్ పైన రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధర రూ.6 మాత్రమే పెరిగింది. ఇవి ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.
 
రేట్ల పెంపు నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.719కు చేరుకుంది. ఇదివరకు ఇంతకుముందు రూ.694గా ఉంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.5కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.777కు చేరింది.
 
తాజా పెంపుతో లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722, హైదరాబాద్‌లోని రూ.771.50కు చేరాయి. 
 
గత ఏడాది డిసెంబర్ నెలలో చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలు పెంచగా, ఈ ఏడాదిలో తొలిసారిగా గ్యాస్‌ ధరలు పెరిగాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ డెలివరీ చేసేందుకు మరో రూ.30 వరకు తీసుకోవచ్చు. అంటే సిలిండర్‌కు రూ.800కు పైగా తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments