Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారం సీజ్‌

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (10:26 IST)
తమిళనాడు విమానాశ్రయాల్లో దాదాపు 9 కిలోల దొంగ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికుల నుంచి అధికారులు రూ. 4.25 కోట్ల విలువైన 8.5 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. 
 
అదేవిధంగా చెన్నై ఎయిర్‌పోర్టులో రూ.19.75 లక్షల విలువైన 465 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 9 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
దుబాయ్‌ నుంచి తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు బుధవారం తెల్లవారుజామున ఇండిగో, ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికులను సెంట్రల్‌ విభాగం డిప్యూటీ డైరక్టర్‌ సతీష్‌ నేతృత్వంలోని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. 
 
ఆ సమయంలో ఒక మహిళతో సహా 8 మంది ప్రయాణికుల వద్ద 8.5 కిలోల బంగారం పట్టుబడింది. మరోవైపు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన జైనుల్లా అబద్ధీన్ (60) నుంచి కూడా 465 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments