Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైన్‌సెట్స్ తయారీ కోసం చైనా కంపెనీ బిడ్... షాకిచ్చిన ఇండియన్ రైల్వే

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (09:11 IST)
వందే భారత్ కింద భారతీయ రైల్వే శాఖ అత్యాధునిక రైళ్లను నడుపుతోంది. వీటిని మినీ బుల్లెట్ రైళ్లుగా అభివర్ణిస్తున్నారు. ఈ రైళ్ళ కోసం కొత్త ట్రైన్ సెట్స్‌ను భారతీయ రైల్వే తయారు చేస్తోంది. 
 
ఈ విషయం తెలుసుకున్న చైనా కంపెనీ ఒకటి వందేభారత్ ట్రైన్‌సెట్స్ తయారీ ప్రాజెక్టు కోసం బిడ్ దాఖలు చేసింది. ఈ కంపెనీకి భారతీయ రైల్వే షాకిచ్చింది. బిడ్ దాఖలు చేసే అర్హత దానికి లేదంటూ తిరస్కరించింది. 
 
ఈ ప్రాజెక్టు విలువ రూ.1,800 కోట్లు కాగా, ఇందులో భాగంగా 44 ట్రైన్స్ సెట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే టెండర్లు ఆహ్వానించగా, బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియాలు బిడ్లు దాఖలు చేశాయి.
 
సీఆర్ఆర్‌సీ-పయనీర్ సంస్థ బీజింగ్‌కు చెందిన సీఆర్ఆర్‌సీ యోగ్జి ఎలక్ట్రిక్ లిమిడెట్, భారత్‌కు చెందిన పయనీర్ ఫిల్-మెడ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. వందేభారత్ ట్రైన్స్ సెట్స్ తయారీ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ఆ సంస్థ మూలాలు భారత్‌లో ఉండాలి. 
 
అయితే, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా మూలాలు చైనాలో ఉండడంతో ఆ సంస్థ దాఖలు చేసిన బిడ్‌ చెల్లదని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ రేసులో బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్ మాత్రమే మిగిలాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments