Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ అని ఇద్దరు తాగుబోతులే అరిచారు.. బ్యాంకులకు ఎగనామమా? తీర్పు వరకు ఆగలేరా?: మాల్యా

బ్యాంకులకు ఎగనామం వేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత మీడియాపై ఫైర్ అయ్యాడు. బ్యాంకులకు తాను బకాయిలు లేనని మాల్యా స్పష్ట చేశారు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని లండన్ కోర్టు

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (13:04 IST)
బ్యాంకులకు ఎగనామం వేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత మీడియాపై ఫైర్ అయ్యాడు. బ్యాంకులకు తాను బకాయిలు లేనని మాల్యా స్పష్ట చేశారు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని లండన్ కోర్టులో మంగళవారం నాడు వాదనలు వినిపించారు. అంతేకాకుండా బెయిల్ కూడా పొందారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాల్యా స్పందిస్తూ.. బ్యాంకులకు బకాయిలు పడి.. భారత్ నుంచి లండన్ వచ్చేసానంటూ భారత ప్రసార మాధ్యమాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలన్నాడు. 
 
భారత మీడియా తనపై హద్దుల్లేని దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. భారత సర్కారు యూకే కోర్టులో ఓ కేసు వేసిందని చెప్పాడు. ఆ కేసు తీర్పు వచ్చేంతవరకు ఆగలేరా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులకు ఎగనామం వేసాననేందుకు తనకు వ్యతిరేకంగా భారత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నాడు.
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యాను దొంగ అని అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై కూడా లిక్కర్ కింగ్ స్పందించారు. తనను దొంగ అని ఎవ్వరూ అనలేదని, ఇద్దరు తాగుబోతులు మాత్రమే అరిచారని, భారత మీడియా అసత్యాలను ప్రచారం చేస్తుందని విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments