Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త యేడాదిలో 10 శాతం పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్ మెషీన్ల‌ ధ‌ర‌లు!

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (15:43 IST)
కొత్త యేడాదిలో అనేక రకాల వస్తువులు ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు పది శాతం మేరకు పెరగనున్నాయి. కాప‌ర్‌, అల్యూమినియం, స్టీల్‌తోపాటు ర‌వాణా ఛార్జీలు కూడా పెర‌గ‌డంతో ఈ పెంపు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని కంపెనీలు చెబుతున్నాయి. 
 
అంతేకాకుండా టీవీ పానెళ్ల ధ‌ర‌లు దాదాపు రెండింత‌లు పెరిగాయ‌ని, ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గడం వ‌ల్ల ప్లాస్టిక్ కూడా భార‌మైంద‌ని త‌యారీదారులు వాపోతున్నారు. జ‌న‌వ‌రి నుంచి ధ‌ర‌లు పెంచ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ఎల్జీ, పాన‌సోనిక్‌, థామ్స‌న్‌లాంటి కంపెనీలు స్ప‌ష్టం చేశాయి. అయితే సోనీ మాత్రం ధ‌ర‌ల‌పై ఇంకా స‌మీక్ష జ‌రుపుతోంది. 
 
విడి భాగాల ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో త‌మ ఉత్ప‌త్తుల త‌యారీ ఖ‌ర్చు కూడా పెరుగుతుంద‌ని, అందువ‌ల్ల జ‌న‌వ‌రిలో ధ‌ర‌ల్లో 6-7 శాతం పెరుగుద‌ల త‌ప్ప‌ద‌ని పాన‌సోనిక్ ఇండియా సీఈవో మ‌నీష్ శ‌ర్మ చెప్పారు. ఈ ధ‌ర‌లు ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికం ముగిసే నాటికి 10-11 శాతానికి పెర‌గ‌వ‌చ్చ‌నీ అభిప్రాయ‌ప‌డ్డారు. 
 
అటు ఎల్జీ ఇండియా కూడా జ‌న‌వ‌రి 1 నుంచి త‌మ కంపెనీ అన్ని ఉత్ప‌త్తుల‌పై 7 నుంచి 8 శాతం ధ‌ర‌లు పెంచ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ విజ‌య్ బాబు తెలిపారు. అటు సోనీ మాత్రం ధ‌ర‌ల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆ సంస్థ ఇండియా ఎండీ సునీల్ న‌య్య‌ర్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments