Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మ నిర్భర్ భారత్ : ఏసీల దిగుమతిపై కేంద్రం నిషేధం

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఆత్మ నిర్భర్ భారత్ అనే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ప్రస్తుతం దేశంలో సగటున 30 శాతం ఏసీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. వీటిని సాధ్యమైనత మేరకు తక్కువ సమయంలోనే దిగుమతి చేసుకునే యూనిట్ల సంఖ్యను తగ్గించుకునేలా ప్రయత్నించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
పైగా, అత్యవసరమైనవి మినహా ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన నరేంద్ర మోడీ సర్కారు ముఖ్యలక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్‌ను ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఏసీలపై ఇదే తరహా నిషేధం విధించారు. దీంతో స్వదేశీ ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments