Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rammohan Naidu: భారతదేశం పైలట్ శిక్షణకు కేంద్రంగా మారాలి.. 30వేల మంది పైలట్లు అవసరం

సెల్వి
మంగళవారం, 11 మార్చి 2025 (19:35 IST)
Kinjarapu Ram Mohan Naidu
రాబోయే 15 నుండి 20 సంవత్సరాలలో భారతదేశానికి దాదాపు 30,000 మంది పైలట్లు అవసరమవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం అన్నారు. విమానయాన సంస్థలు తమ విమానాలను సంఖ్యను పెంచడంతో పాటు సేవలను విస్తరించనున్నందున... దేశీయ విమానయాన సంస్థలు 1,700 కంటే ఎక్కువ విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని, ప్రస్తుత విమానాల సంఖ్య 800కి పైగా ఉందని ఆయన హైలైట్ చేశారు.
 
 200 శిక్షణ విమానాల కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసే కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో పైలట్ శిక్షణను బలోపేతం చేయడంపై గల ప్రాముఖ్యతను తెలిపారు. 
 
"ప్రస్తుతం 6,000 నుండి 7,000 మంది పైలట్లు పనిచేస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్‌తో, భారతదేశం పైలట్ శిక్షణకు కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవాలి" అని మంత్రి అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రభుత్వం 38 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లను (FTOలు) సమీక్షిస్తోంది. వాటికి రేటింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతుంది.
 
విమానాశ్రయాలను వర్గీకరించడానికి విమానయాన మంత్రిత్వ శాఖ ఒక వ్యూహంపై పనిచేస్తోందని, ఇందులో కార్గో కార్యకలాపాలు, పైలట్ శిక్షణ కోసం ప్రత్యేక విమానాశ్రయాలను కలిగి ఉండే అవకాశం ఉందని రామ్మోహన్ పేర్కొన్నారు.
 
ఇకపోతే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి, విమానయాన నెట్‌వర్క్‌ల విస్తరణ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఈ పరిశ్రమ ద్వారా భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి మౌలిక సదుపాయాలు, శిక్షణ సౌకర్యాలను బలోపేతం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments