Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మ నిర్భర్ భారత్ : ఏసీల దిగుమతిపై కేంద్రం నిషేధం

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఆత్మ నిర్భర్ భారత్ అనే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ప్రస్తుతం దేశంలో సగటున 30 శాతం ఏసీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. వీటిని సాధ్యమైనత మేరకు తక్కువ సమయంలోనే దిగుమతి చేసుకునే యూనిట్ల సంఖ్యను తగ్గించుకునేలా ప్రయత్నించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
పైగా, అత్యవసరమైనవి మినహా ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన నరేంద్ర మోడీ సర్కారు ముఖ్యలక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్‌ను ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఏసీలపై ఇదే తరహా నిషేధం విధించారు. దీంతో స్వదేశీ ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments