Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మ నిర్భర్ భారత్ : ఏసీల దిగుమతిపై కేంద్రం నిషేధం

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (17:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించేలా ఆత్మ నిర్భర్ భారత్ అనే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద స్వదేశీ వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించడం. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏసీల దిగుమతిపై నిషేధం ప్రకటించింది. దేశంలో ఏసీ యంత్రాల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ప్రస్తుతం దేశంలో సగటున 30 శాతం ఏసీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. వీటిని సాధ్యమైనత మేరకు తక్కువ సమయంలోనే దిగుమతి చేసుకునే యూనిట్ల సంఖ్యను తగ్గించుకునేలా ప్రయత్నించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
పైగా, అత్యవసరమైనవి మినహా ఇతర వస్తువుల దిగుమతులను భారత్ క్రమంగా తగ్గిస్తోంది. స్వావలంబన సాధించడం, దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడం ప్రధాన నరేంద్ర మోడీ సర్కారు ముఖ్యలక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఈ క్రమంలో ఆత్మ నిర్భర్ అభియాన్‌ను ప్రకటించారు. 
 
ఇందులో భాగంగా పలు రకాల కలర్ టీవీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఇప్పటికే నిషేధం విధించారు. తాజాగా ఏసీలపై ఇదే తరహా నిషేధం విధించారు. దీంతో స్వదేశీ ఉత్పత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments