కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పన్ను విధానం ద్వారా వేతన జీవికి రూ.17500 వరకు ఆదా కానుంది. 'స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులను పరిశీలిస్తే,
ఈ పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను శాతం ఉండదు. అయితే, రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్నును, రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను, రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు.