Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ నోటీసులకు స్పందించకుంటే ఇక తనిఖీలే...

Webdunia
సోమవారం, 29 మే 2023 (11:54 IST)
ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం స్క్రూటినీ (పునః పరిశీలన) కోసం కేసులను ఎలా ఎంపిక చేయాలనే విషయమై ఆదాయాపన్ను శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రకారం.. ఐటీ నోటీసులకు ప్రతిస్పందించని మదింపుదార్ల (అసెసీ) కేసులను తప్పనిసరిగా తనిఖీ చేయనుంది. పన్ను ఎగవేతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారాన్ని, ఏదైనా చట్టబద్ద ఏజెన్సీ, నియంత్రణ అధికారులు అందించినా కూడా ఐటీ విభాగం సదరు కేసులను పరిశీలిస్తుంది.
 
ఆదాయ వ్యత్యాసాలకు సంబంధించి పన్ను అధికారులు జూన్‌ 30లోగా ఐటీ చట్టంలోని సెక్షన్‌ 143(2) కింద నోటీసు పంపాల్సి ఉంటుంది. వాటికి సమాధానాన్ని మదుపుదారుడు ఇవ్వాల్సి వుంటుంది. అలా చేయకపోతే, ఐటీ చట్టంలోని 142(1) ప్రకారం.. తదుపరి చర్యను తీసుకునే నేషనల్‌ ఫేస్‌లెస్‌ అసెస్‌మెంట్‌ సెంటరు (ఎన్‌ఏఎఫ్‌ఏసీ)కు పంపుతారు. 
 
ఈ సెక్షన్‌ కింద రిటర్న్‌ గురించి మరింత స్పష్టమైన సమాచారాన్ని, వివరాలను కోరుతూ నోటీసు జారీ చేసే అధికారం పన్ను అధికారులకు ఉంటుంది. రిటర్న్‌ దాఖలు చేయకపోతే, అవసరమైన సమాచారాన్ని సూచించిన పద్ధతిలో అందించాలనీ కోరవచ్చు. రద్దు చేసిన, ఉపసంహరించిన ఐటీ మినహాయింపులను క్లెయిమ్‌ చేయడం కొనసాగించిన కేసుల ఏకీకృత జాబితాను పన్ను విభాగం సిద్ధం చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments