Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవిష్యత్‌లో నగదు వినియోగిస్తే ఫైన్ : నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్

డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహక చర్యల్లో భాగంగా భవిష్యత్‌లో నగదును ఉపయోగించే వారి నుంచి అపరాధం వసూలు చేసే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సూచన ప్రాయంగా వెల్లడించారు. అంతేకాకుండా, దేశంలో పెద్ద

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (09:07 IST)
డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహక చర్యల్లో భాగంగా భవిష్యత్‌లో నగదును ఉపయోగించే వారి నుంచి అపరాధం వసూలు చేసే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సూచన ప్రాయంగా వెల్లడించారు. అంతేకాకుండా, దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు జనవరి నెల వరకు ఉంటాయన్నారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ఏర్పడేందుకు వీలుగా ప్రజలందరూ డిజిటల్‌ చెల్లింపులు చేసేందుకు గల అన్ని అవకాశాలను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి అమితాబ్‌ కాంత్‌ నేతృత్వం వహిస్తున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో దాదాపు 80 శాతం లావాదేవీలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో జరిపేందుకు ఉన్న అవకాశాలను కమిటీ పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏర్పడిన నగదు కష్టాలు జనవరి నెల మధ్యవరకు ఉంటాయని తెలిపారు. కాగా, 7.5 శాతం వృద్ధి సాధించాలంటే డిజిటైజేషన్ ప్రధానమైనదని ఉద్ఘాటించారు. 
 
మరోవైపు.. త్వరలో మహాత్మాగాంధీ సీరిస్‌లో భాగంగా రూ.500 నోట్లను విడుదల చేస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోటు రెండు నెంబర్‌ ప్యానళ్లపై 'ఈ' ఇంగ్లీషు అక్షరం ఉంటుందని, నోటు రెండో వైపు స్వచ్ఛ భారత్‌ చిహ్నం ముద్రిస్తారని తెలిపింది. కొన్ని బ్యాంకు నోట్లకు అదనంగా నంబర్‌ ప్యానళ్లలో (స్టార్‌) గుర్తు ఉంటుందని తెలిపింది. స్టార్‌ గుర్తుతో రూ.500 నోటు మొదటి సారి జారీ చేస్తున్నామని, స్టార్‌ గుర్తుతో ఉన్న రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు ఇప్పటికే చెలామణీలో ఉన్నాయని పేర్కొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments