అలా చేస్తే లీటరు పెట్రోల్ రూ.32కే లభిస్తుందట.. ఏంటో ఆ చిదంబర రహస్యం!

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (13:19 IST)
దేశంలో చమురు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. నానాటికీ పెరిగిపోతున్న ఈ పెట్రోల్, డీజల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ధరల పెరుగదల కారణంగా నిత్యావసర వస్తు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ విత్తమంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై విధిస్తున్న సెస్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాని ధర భారీగా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. 
 
సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని ఆరోపించారు. సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ సమయాల్లో వేసిన సెస్‌లను తొలగించకుండా, కేంద్రం అలాగే కొనసాగిస్తోందని, అందుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. ఆయా సమయాల్లో వేసిన సెస్‌లను తొలగిస్తే లీటర్ పెట్రోల్ రూ.32కే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
 
అలాగే, దేశంలో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ  ఆలోచన మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే, అమలులో కొంత వైఫల్యం చెందారని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో నోట్ల రద్దును చేపట్టారని... అయితే నల్లధనం ఉన్నవారు వారి డబ్బును వివిధ రకాలుగా వైట్‌గా మార్చుకున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments