వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంపు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (08:46 IST)
దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు మండిపోతున్నాయి. వీటి ధరలు రోజురోజుకా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ వారు ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెట్రోల్, డీజల్ ధరలు రోజువారీగా పెంచేస్తున్నారు. తాజాగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచేశారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై ధరను రూ.273.50కు పెంచేశారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలో ఈ సిలిండర్ ధర రూ.2,186 నుంచి రూ.2,460కు చేరింది. 
 
అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈ ధర విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఈ ధర రూ.2,253కి ఎగబాకింది. గత రెండు నెలల్లో ఈ సిలిండర్ ధరపై ఏకంగా రూ.346 పెరగడం గమనార్హం. కాగా, మార్చి ఒకటో తేదీన రూ.105 పెంచిన చమురు కంపెనీలు 22న రూ.9 పెంచాయి. ఈ సారి ఏకంగా రూ.273.50 చొప్పున పెంచాయి. అయితే, గృహ వినియోగదారులకు మాత్రం చమురు కంపెనీలు ఊరట నిచ్చాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments