Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి సంబరాలు... విమాన ధరలకు రెక్కలు

Webdunia
మంగళవారం, 14 జనవరి 2020 (12:44 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విమాన ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవి మరింత విపరీతంగా పెరిగిపోయాయి. 
 
సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు అనేక మంది తమ సొంతూర్లకు వెళుతున్నారు. ఈ ఉత్సాహం విమాన సంస్థలపై కనకవర్షం కురిపిస్తోంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండటంతో హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రజలు విమానాల్లో వెళుతున్నారు. 
 
హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, కొలంబో కన్నా ఏపీలోని విశాఖ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ వెళ్లే విమాన సర్వీసులకు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. రాజమండ్రికి అయితే ఒకరోజు ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడైపోతున్నాయి.
 
సోమవారం హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి అత్యధిక టికెట్‌ ధర రూ.15,157గా పలికింది. మంగళవారం సాయంత్రం 3:45 నిమిషాలకు హైదరాబాద్‌ నుంచి రాజమండ్రికి వెళ్లే విమాన ఛార్జీ ఏకంగా రూ.19,518గా ఉంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి సోమవారం అత్యధికంగా రూ.12,027 ధర పలకగా మంగళవారం రూ.12843లు ఉంది.
 
అలాగే, విశాఖకు సోమవారం రూ.10,976 ధర ఉండగా మంగళవారం కూడా అత్యధికంగా ఇదే ధర ఉంది. విజయవాడకు సోమవారం అత్యధికంగా రూ.9995లు ధర పలకగా మంగళవారం రాత్రి టిక్కెట్‌ ధర రూ.14837గా ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments