Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనాన్స్ బిల్లు-2017కు త్వరలో సవరణలు.. ఆ పరిమితి దాటితే వాయింపుడేనట...

దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (18:27 IST)
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులోభాగంగా, ఫైనాన్స్ బిల్లు 2017కు సవరణలు చేయనుంది. ఈ సవరణల ద్వారా రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే భారీగా అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. అంటే నగదు లావాదేవీలను కేవలం రూ.2 లక్షలకే పరిమితం చేయనుందన్నమాట. 
 
వాస్తవానికి నగదు లావాదేవీలను రూ.3 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మార్చి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాగా.. ఇప్పుడు దాన్ని రూ.2 లక్షలకు పరిమితం చేసేందుకు సమాయత్తం కానుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ బిల్లు విషయమై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. లావాదేవీకి సమానంగా జరిమానా విధించనున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా ట్వీట్ చేశారు.

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments