దేశంలో మిగిలే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవే...

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (07:34 IST)
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు బ్యాంకులను విలీనం చేసింది. ఈ నేపథ్యంలో మున్ముందు మరిన్ని బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఫలితంగా ప్రస్తుతం దేశంలో 12కు పైగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులు కేవలం సగానికి తగ్గిపోనున్నాయి. అంటే కేవలం ఆరు బ్యాంకులు మాత్రమే మిగలనున్నాయి. మిగతా ఆరింటిని కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రైవేటీకరించనున్నట్లు తెలిసింది. కొత్త పెట్టుబడుల ఉపసంహరణ విధాలంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు బ్యాంకింగ్‌ సేవలను వ్యూహాత్మక రంగాల జాబితాలో చేర్చింది. 
 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు గత విలీన ప్రక్రియల్లో భాగమైన బ్యాంకులను మినహాయించి, మిగతా వాటన్నింటినీ ప్రైవేటీకరించాల్సిన పీఎస్‌బీల జాబితాలో చేర్చినట్లు సమాచారం. అందులో రెండు పీఎస్‌బీలను వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో ప్రైవేటీకరించనున్నారు. 
 
దీంతో భవిష్యత్‌లో దేశంలో మిగిలనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిశీలిస్తే, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకులు మాత్రమే ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments