Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు పునరుజ్జీవం...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:48 IST)
ఆర్థిక నేరస్తుల మోసాలకు బలైపోయిన బ్యాంకులకు పునరుజ్జీవం అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. భారతదేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ అందించడానికి భారత ప్రభుత్వం ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ రీక్యాపిటలైజేషన్ మొత్తం రూ. 48,239 కోట్ల రూపాయలుగా ఉండనుంది.
 
భారతదేశంలో బ్యాంకుల నుండి అప్పు తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా నష్టపోయిన 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ ప్రక్రియకు ఈరోజు ఆమోద ముద్ర పడింది. ఇందులో అత్యధిక మొత్తం కార్పొరేషన్ బ్యాంకుకు కేటాయించగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు అత్యల్ప మొత్తం కేటాయించబడింది.
 
కేటాయింపుల వారీగా కార్పొరేషన్ బ్యాంకుకు రూ. 9,086 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ. 6,896 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 5,908 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 4,638 కోట్లు, యూనియన్ బ్యాంకుకు రూ. 4,112 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు రూ. 3,806 కోట్లు, యూకో బ్యాంకుకు రూ. 3,330 కోట్లు, ఆంధ్రా బ్యాంకుకు రూ. 3,256 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 2,560 కోట్లు, సిండికేట్ బ్యాంకుకు రూ. 1,603 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ. 205 కోట్లు కేటాయించబడ్డాయి.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments