పెన్షన్లలో కోత : క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (16:13 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. పైగా, ఈ కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. దీంతో అనేక రంగాల్లో నిధుల కోత విధిస్తున్నారు. ఇప్పటికే, ఎంపీ లాడ్స్ నిధులతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎంపీల వేతనాల్లో కూడా కోత విధించారు. 
 
అలాగే, కరోనా మహమ్మారి కారణంగా దేశం తీవ్ర నష్టాల్లో ఉందని, దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లను తగ్గించడమో, పెన్షన్లను నిలిపివేయడమో చేస్తారంటూ కొన్నిరోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెన్షన్లలో కోత విధించే ఉద్దేశ్యం తమకు ఏదీ లేదని చెప్పారు. పైగా, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వెల్లడించారు. 
 
'ఈ విషయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) దృష్టికి వచ్చింది. పెన్షన్లలో కోత ఉంటుందని, పెన్షన్లను నిలిపివేయవచ్చని పెన్షన్‌దారుల్లో సందేహాలు నెలకొన్నాయి. అయితే, పెన్షనర్లు నష్టపోయే చర్యలను కేంద్రం తీసుకోవడంలేదు. పెన్షనర్ల సంక్షేమానికి కేంద్ర ప్రబుత్వం కట్టుబడి ఉంది' అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments