Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి నాటికి రూ. 80వేల మార్కుకు చేరనున్న బంగారం ధరలు

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (16:24 IST)
రాజకీయ ప్రభావాలు, వడ్డీ రేటు తగ్గింపుల మధ్య, డిసెంబర్ చివరి వరకు బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 2500 కంటే ఎక్కువ పెరుగుతాయని.. తద్వారా మార్చి నాటికి బంగారం రూ. 80,000కి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. 
 
ఈ సంవత్సరం ప్రారంభం నుండి 20.59 శాతం వద్ద స్థిరమైన రాబడిని అందించిన బంగారం ఈక్విటీ మార్కెట్లను అధిగమించింది. జనవరి 1, 2024 నుండి ధరలు రూ. 63,225గా ఉన్నప్పటి నుండి 20.59 శాతం రాబడిని అందించింది. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గురువారం బంగారం ధర 10 గ్రాములకు రూ.76,000గా ఉంది.
 
ఏడాది ప్రాతిపదికన, బీఎస్ఈ 14.20 శాతం, నిఫ్టీ 16.19 శాతం రాబడినిచ్చాయి. వెండి కూడా 23.20 శాతం ఎక్కువ రాబడిని అందించింది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు చాలా అస్థిరతను కలిగి ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ, బడ్జెట్‌ సమయంలోనూ భారీ కరెక్షన్లు చూసేవుంటాం. 
 
ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం వంటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలతో సహా ప్రపంచ అనిశ్చితులు మార్కెట్‌పై పెద్ద ఎత్తున దూసుకుపోతున్నందున, బంగారాన్ని ఉత్తమ హెడ్జ్‌గా చూడవచ్చని భావిస్తున్నారు. 
 
డిసెంబరు చివరి నాటికి బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,500కి చేరుకోవచ్చని అంచనా. మార్చి నాటికి ధరలు 3000 డాలర్లకు పెరగడంతో, బంగారం ధరలు రూ. 80,000 మరో మైలురాయిని తాకవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులను డ్రగ్స్‌లో కేటీఆర్ ఇరికించారు, వాళ్ల ఫోన్లు ట్యాప్: నట్టి కుమార్

మోక్షజ్ఞ తొలి సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

రూ.200 క్లబ్ లో చేరిన త్రిష.. లియో.. గోట్ ఆమె దశ తిరిగిపోయిందిగా..

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments