Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్షిక బడ్జెట్ ఎఫెక్ట్ : రోజురోజుకూ తగ్గిపోతున్న బంగారం ధరలు!

సెల్వి
శనివారం, 27 జులై 2024 (12:30 IST)
ఇటీవల కేంద్ర ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కారణంగా దేశంలో బంగారం ధరలు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. దీంతో పసిడి ధరలు ఏకంగా 7 శాతం లేదా రూ.5 వేల వరకు తగ్గిపోయాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో రూ.75,000 ఎగువున ఉన్న 10 గ్రాముల బంగారం ధర బడ్జెట్ ప్రకటన తర్వాత రూ.70,650 స్థాయికి తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ.84,000 స్థాయికి పడిపోయింది. ధరలు తగ్గుదలను కొనుగోలుదారులు కూడా స్వాగతిస్తున్నారు.
 
ధరలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుండడంతో ఆభరణాల కొనుగోలు డిమాండ్ కూడా పెరిగింది. తిరిగి బంగారాన్ని కొనేందుకు కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పండగల సీజన్‌కు ముందు ధరల తగ్గుదల తమకు కలిసి రావడం ఖాయమని, ఆభరణాల విక్రయాలకు మరింత ఊతం ఇస్తుందని పీసీ జ్యువెలర్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గార్గ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
కస్టమ్స్ సుంకం తగ్గింపుతో బంగారం దిగుమతులు చౌకగా మారాయి. ఈ నిర్ణయం బంగారం అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేయగలదనే అంచనాలున్నాయి. వ్యవస్థీకృత ఆభరణాల రంగానికి లబ్ది చేకూరుతుందని, బంగారంపై పెట్టుబడులు కూడా పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారాన్ని ఒక ఆస్తిగా ప్రోత్సహించేలా ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments